Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎమ్మెల్యే స్వామి. టంగుటూరు, అమరావతి జ్యోతి: ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే స్వామి అన్నారు. మండలంలోని తూర్పు నాయుడు పాలెం పోన్నలూరు గ్రామాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133 వ జయంతి సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలు న్యాయం కోసం రాజ్యాంగాన్ని రచించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కే దక్కుతుందన్నారు. టిడిపి పార్టీ అధికారంలోకి రాగానే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పార్టీ పనిచేస్తుంది. పేదల పార్టీ తెలుగుదేశం పార్టీని ఎమ్మెల్యే స్వామి మరోసారి ప్రజలకు తేల్చి చెప్పారు. అంబేద్కర్ ఆశయాలు టిడిపి పార్టీతోనే సాధ్యమవుతాయన్నారు. అంబేద్కర్ ఆశయాలు కొనసాగాలంటే రాబోయే రోజుల్లో టిడిపి పార్టీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం పాన్నలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అనుమోలు సాంబశివరావు, కామని విజయకుమార్. మాజీ ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్ మండవ ప్రసాద్, కర్ణ కోటిరెడ్డి, రాపూరి కోటేశ్వరమ్మ, టిడిపి నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు, కుర్ర మల్యాద్రి, మూరబోయిన పాల్యాద్రి, బిరుదుల ఆరోన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi