Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఏసుక్రీస్తు చల్లని దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి క్రిస్మస్ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలి కందుకూరు నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు నెల్లూరు పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు ఇంటూరి రాజేష్ కందుకూరు, అమరావతి జ్యోతి: కులమత బేధం లేకుండా ప్రపంచంలోని ప్రజలందరూ జరుపుకునే పండుగ క్రిస్మస్ అని, ఏసుక్రీస్తు చల్లని దీవెనలతో కందుకూరు నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని నెల్లూరు పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు ఇంటూరి రాజేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తోటివారిపట్ల ప్రేమ, దయాగుణం కలిగి ఉండాలని ఏసుక్రీస్తు చెప్పిన మాటలు గుర్తుంచుకొని, ఆయన బోధనలు పాటిస్తూ కలిసిమెలిసి జీవించాలని తెలిపారు. ఒకరి కష్టాలను మరొకరు పంచుకున్నప్పుడే సమ సమాజం ఏర్పడుతుందన్నారు. ప్రజలు శాంతియుత జీవనం గడపాలన్నారు. పాపులను రక్షించుటకు, వారిని సన్మార్గంలో నడిపించేందుకు ఏసుప్రభువు తన రక్తాన్ని చిందించారన్నారు. శాంతి, సహనం, మంచి ఆలోచనలు మానవులను సన్మార్గంలో నడిపిస్తాయని తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరూ సంతోషంగా క్రిస్మస్ పండుగ జరుపుకోవాలని ఇంటూరి రాజేష్ ఆకాంక్షించారు.
Admin
Amaravathi Jyothi